'ఎమ్మెల్యేనా..ఎంపీనా.. పార్టీ నిర్ణయిస్తుంది' | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యేనా..ఎంపీనా.. పార్టీ నిర్ణయిస్తుంది'

Published Wed, Oct 4 2017 4:41 PM

 dharmapuri aravind on telangana bjp

సాక్షి, నిజామాబాద్‌ : నేను ఎంపీగా పోటీ చేయాలా.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అన్నది బీజేపీ నిర్ణయిస్తుందని రాజ్యసభ ఎంపీ డీఎస్‌ కుమారుడు ధర్మపురి అరవింద్‌ అన్నారు. ఆయనిక్కడ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని, మోదీ ఆలోచనా విధానానికి తాను భక్తున్ని అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యదిక ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement